ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా మీరు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, రిజిస్ట్రార్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలి. లేకపోతే మీకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు అందుతాయి. మీరు సక్రమమైన మార్గంలోనే ఆ ఆస్తిని సంపాదించామని ఆధారాలు చూపకపోతే మీరు చట్టపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో బ్లాక్ మనీ వాడకుండా చూడటానికే అధికారులు ఈ క్రాస్ చెకింగ్ చేస్తుంటారు.