ఒమిక్రాన్ తో ప్రమాదం లేదనే వచ్చే వార్తలను నమ్మొద్దని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కొత్త వేరియంట్ స్వల్ప తీవ్రత కల్గి ఉన్నాయనే వార్తల వల్ల తప్పుడు సాంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు డబ్లూహెచ్ వో బుధవారం ప్రకటించింది.
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో పని చేసే వికలాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్ లో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపును కొనియాడారు.
సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసు అందించడం ప్రారంభించారు. ఒకే రోజు వ్యవధిలో 9 లక్షల మందికి ఈ మూడో డోసు అందించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
థమన్ స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని విషెష్ తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనను కలిసి వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది.
దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ (Zika Virus) విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్ఫూర్(Kanpur) లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గత వారం రోజులుగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా మహమ్మారి కాస్త వెనుకంజ పట్టిందో లేదో ఉత్తరప్రదేశ్ ప్రజలను మరో వైరస్ భయపెడుతున్నది. కాన్పూర్లో క్రమంగా జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా మరో 30 కేసులు రిపోర్టు అయినట్టు జిల్లా మెజిస్ట్రేట్ విశాక్ జీ అయ్యర్ వెల్లడించారు. దీంతో కాన్పూర్లో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 66కు పెరిగింది.
New Delhi: ఇప్పటికే మూడు ఖండాల్లో వెలుగుచూసిన అత్యంత పరివర్తన చెందిన కరోనావైరస్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుందా? లేదా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. గతవారం అనేక పరిశోధన శాలలు ఈ కొత్త కరోనా వేరియంట్ ను గుర్తించాయి. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టారు. ఈ వంశం చాలా అరుదుగా అనిపించినప్పటికీ, ఇది ఇతర ప్రసరణ వేరియంట్ల నుండి చాలా భిన్నంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.