Telangana Assembly Elections 2023: కరీంనగర్ గడ్డమీదనే తెలంగాణ బీజం పడిందనీ, కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. "అలుగనూర్ చౌరస్తాలో అరెస్టు కావడంతో అగ్గిరాజుకున్నదనీ, అది 2009 నవండర్ 29 అయితే, మళ్లీ ఈ సారి 14 ఏండ్ల తర్వాత 2023 నవంబర్ 20న మళ్లీ అగ్గిపెట్టాలే.. ఆ అగ్గిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దహించుకుపోవాలే.." అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.