Kodad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిక్కెట్టు ఆశించినా ఫలితం లేకపోవడంతో తమ అసమ్మతిని వెల్లడిస్తూ.. ఇతక పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి గట్టి షాక్ తగిలింది. కోదాడలో కాంగ్రెస్లోకి 1,000 మంది ముఖ్య బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీలు ఉన్నారు. అలాగే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీ చందర్రావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లారు.