తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి... కానీ ఓటు మాత్రం సమర్దులకే వేయాలని తెలంగాణ ప్రజలకు వర్మ సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది.బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాల్సిన పోలీసే డబ్బులు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కారులో డబ్బులు తరలిస్తున్న పోలీస్ ను పట్టుకుని చెంప చెళ్లుమనిపించారు కాంగ్రెస్ నాయకులు.
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అతి కీలకమైంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు రాజకీయ పార్టీలు అష్టకష్టాలు పడుతుంటాయి.అయితే ఓటు తాము కోరుకున్న అభ్యర్ధికి లేదా పార్టీకి పడిందా కూడ తెలుసుకొనే వెసులుబాటు వీవీప్యాట్ ద్వారా ఉంది.
ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలికి ఉపయోగించే సిరా హైద్రాబాద్లో తయారౌతుంది. ప్రపంచంలోని వంద దేశాలు ఈ సిరాను ఉపయోగిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందకపోవడంతో ఇవాళ సాయంత్రం వరకు ఓటుహక్కను వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసి.
పోలింగ్ స్టేషన్లో చాలెంజ్ చేసి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. టెండర్ ఓటును లెక్కించరు. కోర్టు ఆదేశాలిస్తే ఈ ఓటును లెక్కిస్తారు.
కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు అధికార బిఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీని ఈసీ ఆదేశించింది.