స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నిన్నటి వరకు ఉద్రిక్తతలు కొనసాగగా, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించారు. దీంతో సూచీలు కుప్పకూలాయి.
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలు భావిస్తున్నట్లుగానే ఉక్రెయిన్ మీద రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే రష్యా మిలటరీ చర్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా మిలటరీని సంసిద్దం చేసింది. ఇలా ఇరుదేశాలు సై అంటే సై అంటుండటంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉక్రెయిన్ మూడు వైపులా రష్యా బలగాలు మొహరించాయి.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అన్యాయమైన దాడిగా ఆయన అభివర్ణించారు.
ఉక్రెయిన్ చుట్టూ రష్యా సైనిక బలగాలు మోహరిస్తుండటంతో ఎప్పుడైనా యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పార్లమెంట్ అత్యవసర పరిస్థితిని ఆమోదించింది. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.
ఉక్రెయిన్ లో వాతావరణం టెన్షన్, టెన్షన్ గా మారిపోయింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు ఉక్రెయిన్ లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించడం దీనికి మరింత బలాన్ని ఇస్తోంది.
Russia-Ukraine flare-up: రష్యా-ఉక్రెయిన్ల మధ్య వార్ తప్పేలా కనిపించడం లేదు. రష్యా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించి.. ఆ దేశ రాజధాని కీవ్ దిశగా సైనికబలగాలను కదిలించే దిశగా సాగుతోంది. ఆయా పరిస్థితులపై జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ స్వరణ్ సింగ్ ఏసియా నెట్ న్యూస్ తో మాట్లాడుతూ.. ఆ పరిస్థితులను వివరించారు.
ఉక్రెయిన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా మొదటి రోజు నడిపిన విమానంలో దాదాపు 250 మంది విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24,26వ తేదీల్లో ఎయిర్ ఇండియా మరో రెండు విమానాలను నడపనుంది.
రష్యా దేశానికి చెందిన మిలటరీ ఉక్రెయిన్ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు రక్షణ ఆయుధాల సరఫరాను అమెరికా కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఆయన ప్రసంగించారు.
ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించారు. పుతిన్ గంట సేపు టెలివిజన్ ద్వారా ప్రసంగించి ఈ వివరాలు వెల్లడించారు.
తూర్పు ఉక్రెయిన్ (eastern Ukraine)లో కాల్పుల విరమణ కోసం పనిచేయడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron), రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆదివారం అంగీకరించారు. ఈ వివరాలను మాక్రాన్ కార్యాలయం వెల్లడించింది