Asianet News TeluguAsianet News Telugu

ఒకే కాన్పులో నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ...

సిరిసిల్ల :ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. 

సిరిసిల్ల :ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ఈ అరుదైన ఆపరేషన్ కు వేదికయ్యింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం గ్రామానికి చెందిన కిషన్-లావణ్య దంపతులకు ఓ కొడుకు సంతానం. రెండోసారి గర్భంధాల్చిన లావణ్య వైద్యం కోసం పీపుల్స్ హాస్పిటల్ కు వెళ్లగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఓ ఆడ, ముగ్గురు మగ శిశువులు మొత్తం నలుగురు బిడ్డలకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది లావణ్య. ఒక్కో శిశువు కిలో బరువుతో పుట్టినట్లు డాక్టర్లు శంకర్, అఖిల తెలిపారు. పదిలక్షల మందిలో ఏ ఒక్కరికో ఇలా అరుదుగా నలుగురు బిడ్డలు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు.