Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ దత్త పుత్రిక ను పెండ్లి కూతురిని చేసిన సీఎం సతీమణి శోభ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం రేపు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం రేపు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లికూతురును చేశారు. ఈ  కార్యక్రమంలో ప్రత్యూషకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి, ఆశీర్వదించారు కేసిఆర్ సతీమణి శోభ. ఈ వేడుకకు మంత్రి సత్యవతి రాథోడ్,  మహిళా భివృద్ధి కమీషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.