తెలంగాణలో పోటీకి షర్మిల పక్కా ప్లాన్: గెలుపుకోసం ఈ రెండు స్థానాలను ఎంచుకున్న రాజన్న తనయ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. 

First Published Mar 16, 2021, 4:56 PM IST | Last Updated Mar 16, 2021, 4:56 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ కోడలిని అంటూ ఆమె ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. రాజన్న రాజ్యం అనే కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకురావడం ద్వారా.... అధికార తెరాస లోపాలను ఎత్తిచూపడమే కాకుండా ఆమె ఏమి చేయదల్చుకున్నారో కూడా ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. షర్మిల ఇంతకు ఎవరు వదిలిన బాణం అనే విషయంలో క్లారిటీ రాక అందరూ తలలు పట్టుకుంటుంటే... ఆమె మాత్రం పార్టీ ఏర్పాటు, విస్తరణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.