Asianet News TeluguAsianet News Telugu

శరవేగంగా యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం... పరిశీలించిన మంత్రుల బృందం

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్మిస్తున్న యాదవ, కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.

First Published Feb 7, 2023, 2:24 PM IST | Last Updated Feb 7, 2023, 2:24 PM IST

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్మిస్తున్న యాదవ, కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కోకాపేటలో రూ.10 కోట్ల నిధులతో 10 ఎకరాల్లో విశాలమైన రెండు భవనాలను నిర్మిస్తున్నారు. అన్ని సదుపాయలతో గొల్ల కుర్మలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న ఈ రెండు భవనాలను మార్చి 10న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.