Asianet News TeluguAsianet News Telugu

మామను సిఎం చేసిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు...

కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు.

కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వలసకార్మికులకు భోజనాలు, వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారిని స్వస్థలాలకు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ 
ఎమ్మెల్యే, కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి చేసిన కృషిని పొగుడుతూ ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ నోరు జారాడు. దీంతో మరో వివాదానికి తెర తీసినట్టైంది.