Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ టార్గెట్ గా ఫ్లెక్సీలు

జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలోభాగంగా  స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ లీడర్లు కట్టిన ఫ్లెక్సీల పక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా  ఆసక్తిగా మారింది.  

జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలోభాగంగా  స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ లీడర్లు కట్టిన ఫ్లెక్సీల పక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా  ఆసక్తిగా మారింది.   గతంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలైన ఎన్నారై సెల్ ఏర్పాటు, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి. అయితే నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ కు పసుపు బోర్డు విషయంలో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలసిన ఒక రోజు వ్యవధిలోనే అధికార పార్టీకి వ్యతిరేకంగా జగిత్యాల, మెట్టుపెల్లి ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల ఈ ప్లెక్సీలను బిఆర్ఎస్ నాయకులు తొలగించారు.అయితే దీని వెనుక బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.