టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం గుండాలు రెచ్చిపోతున్నారు : బండి సంజయ్
భైంసాలో ఆదివారం జరిగిన గొడవల మీద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు.
భైంసాలో ఆదివారం జరిగిన గొడవల మీద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఎంఐఎం, టీఆర్ఎస్ లు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భైంసాలో ఎంఐఎం గుండాలు సాగించిన హింసాకాండ అధికార టీఆర్ఎస్ అండదండలతోనే జరిగిందన్నారు.