Bandi Sanjay: రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్ | Telangana LRS | Asianet News Telugu
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట రూ.50 వేల కోట్లు దోపిడీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసిందని ఆరోపించారు. గతంలో ఇదే పని కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుపడ్డ కాంగ్రెస్.. ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ చెల్లించవద్దన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్పై రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క గతంలో మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించారు.