అయోధ్య రామాలయం పూజారి తిరుపతి వేద విద్యాలయం విద్యార్థి

ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో మోహిత్ పాండే పదవ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత, 2020-21 విద్యా సంవత్సరంలో ఎస్ వివియూలో బీఏ (శాస్త్రి) కోర్సులో చేరాడు.

Share this Video

అయోధ్య : ప్రస్తుతం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ)లో ఎంఏ (ఆచార్య) కోర్సును అభ్యసిస్తున్న మోహిత్ పాండే అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వ్యక్తి, రామాలయం అర్చకుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరందరిలో 200 మంది షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 50 మందిని ఎంపిక చేశారు. అందులో పాండే ఎంపికయ్యారు. మోహిత్ పాండే పూజారిగా బాధ్యతలు తీసుకునే ముందు ఆరు నెలల శిక్షణను పొందుతున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video