Asianet News TeluguAsianet News Telugu

చివరి దశకు చేరుకున్న అయోధ్య రామమందిర నిర్మాణం, రామజన్మభూమి నుండి ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్

2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది.

2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగితే పూజలు చేసే అవకాశం కోసం రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అసాధారణ మందిరం అసమాన శిల్పనైపుణ్యానికి, ఇంజినీరింగ్‌కు తార్కాణం. జనవరి నెలలో ఈ మందిరం ప్రారంభం కానున్నది.

ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 2.7 ఎకరాల్లో 54,700 చదరపు అడుగుల వైశాల్యంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ మహత్కార్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.