Asianet News TeluguAsianet News Telugu

National Education Day 2021: అబుల్ కలాం ఆజాద్ కు సీఎం జగన్ నివాళి

అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ జరిపాయి.  క్యాంప్‌ కార్యాలయంలో అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి  పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్‌ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, సయ్యద్ రఫీ, ఏవ రమణ , కుమార్ స్వామి, దారప నరేంద్ర పాల్గొన్నారు.  
 

అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ జరిపాయి.  క్యాంప్‌ కార్యాలయంలో అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి  పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్‌ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, సయ్యద్ రఫీ, ఏవ రమణ , కుమార్ స్వామి, దారప నరేంద్ర పాల్గొన్నారు.