
India First Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ లోపల ఎలా ఉంటుందో తెలుసా?
భారతదేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిశీలించారు. ఈ ఆధునిక స్లీపర్ రైలు గువాహటి–హౌరా మార్గంలో ప్రయాణించనుంది. ప్రయోగాత్మక ప్రయాణాలు (ట్రయల్స్) పూర్తయ్యాయి.ఈ రైల్లో ఆటోమేటిక్ తలుపులు, కవచ్ (KAVACH) భద్రతా వ్యవస్థ, సీసీటీవీ నిఘా, ఆధునిక టాయిలెట్లు మరియు రాత్రి ప్రయాణానికి అనుకూలమైన సౌకర్యాలు ఉన్నాయి. భారతీయ రైల్వే ఆధునికీకరణలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.