Asianet News TeluguAsianet News Telugu

విశాఖ నగరానికి మరో మణిహారం... సీ హ్యారియర్ మ్యూజియం

తీర నగరం విశాఖపట్నానికి మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరుతున్నది.

తీర నగరం విశాఖపట్నానికి మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరుతున్నది. ఆర్‌కే బీచ్ రోడ్‌లో మే 11వ తేదీన సీ హ్యారియర్ మ్యూజియాన్ని ప్రారంభిస్తున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేసింది. డిఫెన్స్, ఏవియేషన్ రంగంలో ఆధునిక సాంకేతికతలనూ ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం విశేషం. భారత నావికా దళం, దాని ఘనమైన చరిత్రకు నివాళిగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు.