Asianet News TeluguAsianet News Telugu

టాయిలెట్ లో ఉరివేసుకుని మైనర్ యువతి ఆత్మహత్య....

గుంటూరు : బోటుయార్డు సమీపంలో సియం ఇంటికి వెళ్లే రోడ్డులో నివాసముండే 17 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుంది.

గుంటూరు : బోటుయార్డు సమీపంలో సియం ఇంటికి వెళ్లే రోడ్డులో నివాసముండే 17 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన నివాసానికి దగ్గర్లోని మునిసిపల్ టాయిలెట్ లో ఉరివేసుకుని లంకె నందిని అనే యువతి చనిపోయింది. కొద్ది రోజులలోనే పెళ్ళి పీటలు ఎక్కాల్సిన సమయంలో సూసైడ్ చేసుకోవంట స్థానికంగా కలకలం రేపింది. స్తానికులు ఇచ్చిన సమాచారం మేరకు తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ నిరుపేదలు.. తనకు బొల్లి ఉంది. ఆ విషయం పెళ్ళి వారికి తెలిస్తే ఇబ్బంది అవుతుందని బావించింది. దీంతోపాటు వివాహానికి డబ్బులెలా అనే ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే ఆత్మహత్య కు పాల్పడినట్లు స్తానికులు అంటున్నారు.