
వామపక్షాల జివిఎంసి ముట్టడి ఉద్రిక్తం... మహిళల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
విశాఖపట్నం: వైసిపి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ ఇష్టారీతిన పెంచిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో వామపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రక్తంగా మారింది.
విశాఖపట్నం: వైసిపి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ ఇష్టారీతిన పెంచిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో వామపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రక్తంగా మారింది. వామపక్ష నాయకులు, కార్యకర్తలు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా గాంధీ విగ్రహం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులకు, పోలీసులకు వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. ఇలా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
