ఒక్కొక్కడినీ బట్టలు ఊడతీసి కొడతా.. పోలీసులకు జగన్ వార్నింగ్ | Vallabhaneni Vamsi | Asianet Telugu
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తరువాత బట్టలు ఊడదీసి కొడతామన్నారు.