Asianet News TeluguAsianet News Telugu

రైతు భరోసా కేంద్రంలో ధాన్యం అమ్మి మోసపోయాం..: ఇబ్రహీంపట్నం రైతుల ఆందోళన

మైలవరం : ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు భరోసా సెంటర్ (ఆర్బికె) లో ధాన్యం అమ్మి పోసపోయామంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. 

మైలవరం : ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు భరోసా సెంటర్ (ఆర్బికె) లో ధాన్యం అమ్మి పోసపోయామంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. ఇబ్రహీంపట్నం మండలంలోని
ఆర్బికె అధికారులు రైతుల నుండి ఒడ్లు  కొనుగోలు చేసి మోసం చేసారంటూ శాంతినగర్ మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు నెలల క్రితం ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని... ఇదేంటని ప్రశ్నిస్తే ఆర్బికె కింద కొనుగోలు చేయలేదంటూ డిఎం మాట మారుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేసారు. ధాన్యం కొనుగోలు చేసిన మిల్లుతో తమకెలాంటి సంబంధం లేదని చేతులెత్తేస్తున్న డిఎంఓ శివరామమూర్తి  రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా మోసపోయిన రైతుల ఆందోళనకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల గాంధీ మద్దతు తెలిపారు.