Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...

ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాలకు చెందిన రైతులు బంద్‌ నిర్వహిస్తున్నారు.

ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాలకు చెందిన రైతులు బంద్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలోతాడికొండ తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామంలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ పురుగుల మందు 
డబ్బాలు చేతపట్టి  రైతులు నిరసన తెలియజేశారు.