ఏపీలో సంక్రాంతి సందడి... కోడి పందేలకు సై అంటున్న పందెరాయుళ్లు
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సొంతూళ్లకు చేరుకుంటుండటంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఇక పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కోడిపందేల కోసం నిర్వహకులు ఏర్పాట్లను ముమ్మరం చేసారు. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గండిగుంట,పెద్ద ఓగిరాల గ్రామల్లో సంక్రాంతి కోడిపందేల కోసం అంతా రెడీ అయ్యింది. ఈ గ్రామాల్లో ఇప్పటికే పందెం బరులను సిద్దంచేసి పందెంకోళ్లను రెడీగా వుంచారు.