
Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కారులోని నలుగురు వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటకువచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఓ క్రేన్ సాయంతో కారును కూడా కాలువలోంచి బయటకుతీసారు.
Add Asianetnews Telugu as a Preferred Source
