Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు. ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వడంతో పాటు అందరు ఉద్యోగుల మాదిరిగానే ప్రసూతి సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం డిఎంహెచ్వో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో, విశాఖపట్నంలోనూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు.