
నల్లబ్యాడ్జీలతో విధులకు... పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల ఉద్యమం షురూ
విజయవాడ: పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు.
విజయవాడ: పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాయాల్లో పనిచేసే ఉద్యోగులు నల్ల బాడ్జీలను ధరించి నిరసన తెలుపుతున్నారు. ఏపీజేఎసి, ఏపీజేఎసి అమరావతి లో భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతున్నాయి. విజయవాడలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నెల్లూరులోని ఖజానా కార్యాలయంలో ఉద్యోగుల నిరసన చేపట్టారు. పిఆర్సీ అమలుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
