పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఫేస్గా ఎంపిక కాకపోవడంపై పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూలో అసంతృప్తి ఉన్నట్టు చాలా మంది భావించారు. కానీ, తాజాగా, ఆయన అధిష్టానం నిర్ణయంతో తమకే ఇబ్బంది లేదని, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని అందరూ స్వాగతించారని సిద్దూ వివరించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్లో ఇక కలహాలు ముగిసినట్టేనా? అనే అంశంపై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.