ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించింది. ఒకే పార్టీకి ఇంత మెజారిటీ రావడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 90 స్థానాలు సాధించింది.
Punjab Election Results 2022: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఆప్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్లుతున్నది. సీఎంగా భగవంత్ మన్ ప్రమాణం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలోనే భగవంత్ మన్ జీవిత ప్రయాణంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు కారణం ఆయన తన కెరీర్ను స్టాండప్ కమెడియన్గా ప్రారంభించడమే. కమెడియన్గా మొదలైన ఆయన ప్రస్థానం సీఎం కుర్చీ అధిరోహించే వరకూ సాగింది.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ కు లడ్డూలు ఇచ్చేందుకు ఢిల్లీ ఎమ్మెల్యేలు ఆయనకు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పంజాబ్ ప్రజలు అద్భుత విజయాన్ని ఇచ్చారని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన గురువారం నాడు వ్యాఖ్యానించారు.
Punjab election result 2022: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాలనా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్నదనీ, పంజాబ్ లో ఆప్ గెలుపు సామాన్యుల విజయమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ఇది సామాన్యుడి విజయం అని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా అన్నారు.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఫలితాల సరళిలో ఆప్ ముందంజలో ఉన్నది. పంజాబ్లో ఆప్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ మార్పు కేవలం పంజాబ్కే పరిమితం కాబోదని, దేశ రాజకీయాలపైనా దాని ప్రభావం బలంగా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి ఆప్ అధికారం వైపునకు దూసుకెళ్తోంది. ఢిల్లీలో ఆప్ పాలన ప్రభావం పంజాబ్ పై తీవ్ర ప్రభావం చూపింది.