Punjab election result 2022: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాలనా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్నదనీ, పంజాబ్ లో ఆప్ గెలుపు సామాన్యుల విజయమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
Punjab election result 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ.. రాష్ట్రంలోని అన్నిప్రధాన పార్టీలను ఊడ్చిపడేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మరో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సుసోడియా మాట్లాడుతూ... పంజాబ్ లో ఆమ్ ఆద్మీ (ఆప్) సాధించిన గెలుపు.. సామాన్యుల గెలుపు అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాలనా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్నదని పేర్కొన్నారు.
పంజాబ్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనా విధానాలకు ఆమోదం తెలిపాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గురువారం అన్నారు. "మేము కేజ్రీవాల్ మోడల్ పాలనను మాకు కారకంగా చేస్తున్నాము. బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ జీలు కలలు కన్న భారతదేశం కోసం వారి దార్శనికతపై ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే మంచి ఉద్దేశ్యంతో నిజాయితీగల ప్రభుత్వం నడుపుతున్నాం. మేము ప్రాథమిక సౌకర్యాలు, పాఠశాలలు, వైద్యం, ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నాము. మేము ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాము. ప్రజలు ఆలోచన కనెక్టు అయి ముందుకు సాగుతూ.. మెరుగైన పాలన అందిస్తున్నామని" అన్నారు.
"ఇది (ఆప్ పాలనా విధానం) ఢిల్లీలో మెరుగైన ఫలితాలు అందించింది. ఇప్పుడు పంజాబ్లో కూడా పని చేస్తోంది. ఇది మా 'కేజ్రీవాల్ పాలనా నమూనా'తో మరింత జాతీయ పాత్రను పోషిస్తుందని చూస్తుంది. ఢిల్లీ మరియు పంజాబ్లలో మేము చేసే పనిని గమనించండి. భారతదేశ ప్రజలు ఇప్పుడు మాతో.. ఆప్ తో ఉన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదు.. ' ఆమ్ ఆద్మీ ' (సామాన్యుడు) విజయం" అని సిసోడియా అన్నారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నాడు ప్రారంభమైంది. మొదటి నాలుగు గంటల తర్వాత మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాల్లో ఆధిక్యం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో క్లీన్స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది.
ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది అని తెలిపారు. త్వరలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఆప్ భర్తీ చేస్తుందని అన్నారు. దేశంలో అతిపెద్ద ప్రతిపక్షంగా ఆప్ అవతరిస్తుందని తెలిపారు. "ఆప్ జాతీయ శక్తిగా మారడాన్ని నేను చూస్తున్నాను. కాంగ్రెస్కు జాతీయ మరియు సహజ ప్రత్యామ్నాయంగా ఆప్ అవతరించబోతోంది" అని రాఘవ్ చద్దా మీడియాతో అన్నారు. "ఇది ఒక పార్టీగా ఆప్కి అద్భుతమైన రోజు, ఎందుకంటే ఈ రోజు మేము జాతీయ పార్టీగా మారాము. మేము ఇకపై ప్రాంతీయ పార్టీలం కాదు. సర్వశక్తిమంతుడు.. అరవింద్ కేజ్రీవాల్ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అతను ఒక రోజు దేశానికి నాయకత్వం వహించాలి" అని ఆయన అన్నారు.