ఒడిశా రైలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలు సమీపంలోని బహనాగ ప్రభుత్వ హాస్పిటల్లో తాత్కాలికంగా ఉంచారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీలను భువనేశ్వర్ హాస్పిటల్కు తరలించారు. ఆ భారీ మొత్తంలో శవాలను స్కూల్లో చూసిన స్థానికులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించబోమని చెప్పారు. దీంతో అధికారులు శుక్రవారం ఆ భవనాన్ని కూల్చేశారు.
ఒడిశా రైలు ప్రమాదంలో 278 మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 40 మంది కరెంట్ షాక్తో మరణించి ఉండొచ్చని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు. ఈ ఘటనపై దాఖలైన ఎఫ్ఐఆర్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఒడిశా ట్రైన్ ప్రమాద ఘటన చుట్టూ అనేక సందేహాలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. ఆయన స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన రెండు విషయాలను స్పష్టం చేశారు.