లులు మాల్ వివాదాన్ని అధికారులు చాలా సీరియస్ గా తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆ వ్యాపార సంస్థకు నష్టం చేకూర్చేవిధంగా కొందరు కావాలనే ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని మరో సారి తేల్చి చెప్పారు.