యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో సిటీలో ఇటీవల ఓ మాల్ ను ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ మాల్ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంలో లక్నోలో నిషేధంలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.
లక్నోలోని లులు మాల్ ప్రాంగణంలో నమాజ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై ఆ మాల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు IPC సెక్షన్లు 153A, 295A, 341 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మాల్ను జూలై 10వ తేదీన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే షాపింగ్ ఎరీనాలోని బహిరంగ ప్రదేశంలో కొందరు వ్యక్తులు నమాజ్ చేశారు. ఇది వివాదస్పదమైంది. అయితే నమాజ్ చేస్తున్నప్పుడు వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని యాజమాన్యం పేర్కొంది. అందులో ఎవరూ మాల్ లో పని చేసే ఉద్యోగులు కూడా లేరని చెప్పారు.
Gujarat rains: భారీ వర్షాలు.. గుజరాత్లోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 27 రాష్ట్ర రహదారులు మూత !
ఈ నమాజ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో అనేక హిందూ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నమాజ్ చేసిన వారిపై, మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మాల్లో మళ్లీ నమాజ్ చేస్తే సుందర్ కాండ పఠిస్తామని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. అలాగే ఆ మాల్ను బహిష్కరించాలని హిందూ సమాజాన్నిఆ సంస్థ కోరింది. మాల్ ‘లవ్-జిహాద్’లో మునిగిపోయిందని ఒక ప్రకటనలో ఆరోపించింది. మాల్లో నియమితులైన ఉద్యోగుల్లో 80 శాతం మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మిగిలిన 20 శాతం మంది హిందూ బాలికలు అని సంస్థ తెలిపింది.
లులు మాల్లో నమాజ్ చదవడంపై యాజమాన్యంతో పాటు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన శిశిర్ చతుర్వేది ఫిర్యాదు చేసినట్లు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలోని పోలీస్ స్టేషన్ ఇంచార్జి అజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా లక్నోలోని బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడంపై సెక్షన్ 144 కింద నిషేధం ఉందని తెలిసిందే.
జార్ఖండ్ లోని 33 బడుల్లో శుక్రవారం సెలవు... విచారణకు ఆదేశించిన సర్కారు
ఈ నమాజ్ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్కులేట్ అయ్యింది. #LULUMALLLUCNOW ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. ఈ వీడియో ఫేస్బుక్, వాట్సాప్లలో కూడా విస్తృతంగా షేర్ అయ్యింది. మాల్ యాజమాన్యంపై నెటిజన్లు ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. మాల్లో మతపరమైన కార్యకలాపాలను ఎలా అనుమతించగలరని ప్రశ్నించారు. అయితే లులు మాల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటన గురించి తమకు తెలియదని తెలిపింది. తమ మాల్ ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలనూ ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది.
‘‘ లులు మాల్ అన్ని ప్రాంతాలను గౌరవిస్తుంది. మేము ఇక్కడ ఎలాంటి మతపరమైన సమావేశాలు లేదా ప్రార్థనలను అనుమతించం. అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు మా ఫ్లోర్ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాము. ఈ మాల్ను ప్రపంచ స్థాయి మాల్గా మార్చాలనుకుంటున్నాము. ఈ కలను సాకారం చేసుకోవడానికి మాకు సహాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం ’’ అని అడ్మినిస్ట్రేటివ్ ఒక ప్రకటన విడుదల చేసింది.