మొన్నటి వరకు కాంగ్రెస్ లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీ అంటేనే ఆమడ దూరం పెడుతున్నారు. బీహార్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై ఆయన రాష్ట్రం అంతటా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎప్పటికీ చేరబోనని చెప్పారు. ఆ పార్టీలో చేరితే తాను కూడా మునిగిపోతానని అన్నారు.