మొన్నటి వరకు కాంగ్రెస్ లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీ అంటేనే ఆమడ దూరం పెడుతున్నారు. బీహార్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై ఆయన రాష్ట్రం అంతటా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎప్పటికీ చేరబోనని చెప్పారు. ఆ పార్టీలో చేరితే తాను కూడా మునిగిపోతానని అన్నారు. 

కాంగ్రెస్ లో తాను  ఎప్ప‌టికీ చేరేది లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న చేతులు జోడించి మ‌రీ చెప్పారు. కొన్ని వారాల కింద‌ట పీకే కాంగ్రెస్ లో చేర‌డం దాదాపు ఖాయ‌మైపోయింద‌ని దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. అయితే అనూహ్యంగా పీకే త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. తాను కాంగ్రెస్ లో చేర‌బోవ‌డం లేని ట్విట్ట‌ర్ వేధిక‌గా తెలియ‌జేశారు. అయితే ఆయ‌న త‌న సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పీకే ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

‘‘ 2015లో బీహార్‌, 2017లో పంజాబ్‌, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌రెడ్డి, తమిళనాడు, బెంగాల్‌లలో గెలిచాం.. 11 ఏళ్లలో ఒకే ఒక్క ఎన్నికల్లో ఓడిపోయాం..అదే 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో.. అందుకే కాంగ్రెస్‌తో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నాను ’’ అని ప్రశాంత్ కిషోర్ చేతులు జోడించి చెప్పారు.

బంగ్లాదేశ్ నుంచి ఈదుతూ భారత్‌లోకి.. లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి యువతి ఏటికి ఎదురీత

కాంగ్రెస్ ఎప్పటికీ కలిసిరాని పార్టీ అని ఆయ‌న అన్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ బాస్ లు దిగిపోయి అందరినీ తమతో తీసుకెళ్తారని.. వారితో పోతే నేనూ మునగడం ఖాయ‌మ‌ని ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు వైశైలిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పీకే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. కాగా గ‌తంలో కూడా రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన వ్యూహాత్మ‌క స‌మావేశం ‘చింతన్ శివిర్’ ను ప్ర‌శాంత్ కిషోర్ వైఫ‌ల్యంగా ప్ర‌క‌టించారు. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో పార్టీకి ఘోరంగా ప‌రాజ‌యం పాల‌వుతుంద‌ని  పీకే అంచ‌నా వేశారు. 

Scroll to load tweet…

కొన్ని నెల‌ల నుంచి కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌య‌త్నాలు చేశారు. గ‌తేడాది రెండు సార్లు చ‌ర్చ‌లు జ‌రిగినా.. పార్టీ అధిష్టానానికి, ఆయ‌న‌కు మ‌ధ్య ఉన్న భిన్నాభిప్రాయాల కార‌ణంగా అవి విఫ‌లం అయ్యాయి. గ‌త నెల‌లో కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రణాళికపై ఆయ‌న ఇచ్చిన 600-స్లైడ్ ప్రెజెంటేషన్‌ను సీనియర్ నాయకుల ప్యానెల్ చర్చించింది. కానీ అది కూడా ఫలించలేదు. కాగా పీకే గ‌తేడాది గాంధీ కుటుంబానికి సమర్పించిన ఒక ప్రణాళిక ప్రకారం సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా నియ‌మించి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్‌గా గాంధీయేత‌ర వ్య‌క్తిని నియ‌మించాల‌ని, అలాగే రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా సిఫార్సు చేసింది.

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో అనుమానితుడు, తొలి అరెస్ట్ ఇదే

అయితే గ‌త నెలలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌డం దాదాఫుగా ఖారరు అయ్యింది. దీనిపై ప‌లు విడ‌త‌లుగా రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పీకేను ‘‘ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’’ లో సభ్యుడిగా ప‌ని చేయాల‌ని సూచించింది. దీంతో అత‌డు పార్టీలో చేరిక‌పై త‌న మ‌న‌సు మార్చుకున్నాడు. అలాంటి గ్రూప్ న‌కు పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎలాంటి అధికారం లేదని, ఇది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తుందని ఆయన అన్నారు.