ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (DBU) త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జూలై నాటికి 75 జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, పది ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.