సారాంశం

mobile banking: క‌రోనా మ‌మ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను వాడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింద‌ని రిపోర్టుపు పేర్కొంటున్నాయి. ఏకంగా 10 మంది భార‌తీయుల్లో 8 మంది మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను వాడుతున్నారు. 
 

mobile banking: క‌రోనా మ‌మ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను వాడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింద‌ని రిపోర్టుపు పేర్కొంటున్నాయి. ఏకంగా 10 మంది భార‌తీయుల్లో 8 మంది మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను వాడుతున్నారు. మెట్రో నగరాల్లో బ్యాంకు ఖాతా ఉన్న పది మంది భారతీయుల్లో ఎనిమిది మందికి పైగా ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారనీ, ఇది కోవిడ్ -19 మహమ్మారి మధ్య పెరిగినట్లు కొత్త నివేదిక తెలిపింది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన ఫారెస్టర్ (Forrester) నివేదిక ప్ర‌కారం.. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు ఆసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లుగా ఉన్నాయి. భార‌త్ లోని మెట్రో ప్రాంతాల్లో 83 శాతం, చైనా మెట్రో న‌గ‌రాల్లోని 78 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. ఈ క్ర‌మంలోనే బ్యాంకింగ్ సేవ‌లు అన్నింటిని ఆన్‌లైన్ లో అందించ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కొన‌సాగిన స‌మ‌యంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్ (mobile banking apps)ల వినియోగం పెరిగింది. అలాగే, బ్యాకింగ్ డిజిట‌ల్ సేవ‌ల ప‌రివ‌ర్త‌న‌ను వేగ‌వంతం చేసింద‌ని ఈ నివేదిక పేర్కొంది. క‌రోనా కార‌ణంగా డిజిట‌ల్ చెల్లింపులు సైతం రికార్డు స్థాయిలో పెరిగాయ‌ని పేర్కొన్న ఈ నివేదిక‌.. ఏటీఎం వినియోగం క్షీణిస్తున్న‌ద‌నే విష‌యం వెల్ల‌డించింది. ఫిన్‌టెక్ మరియు టెక్ దిగ్గజాలు టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలు చేయడం ఈ ప‌రిస్థితుల‌కు దారి తీశాయి. “టెక్ టైటాన్స్ అమెజాన్, యాంట్ గ్రూప్, యాపిల్, గూగుల్, మెటా, పింగ్ ఆన్ మరియు టెన్సెంట్‌లు సహకారాన్ని ప్రారంభించడానికి మరియు కలిసి విస్తృత ప్లాట్‌ఫారమ్‌లు మరియు పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మొబైల్, క్లౌడ్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లు, రియల్ టైమ్ డేటా, ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ వంటి డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు" అని నివేదిక పేర్కొంది.

అయితే, బ్యాంకులు వేగంగా రూపాంతరం చెందడానికి కష్టపడుతున్నాయ‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. "ఇప్పుడు చాలా బ్యాంకులు డిజిటల్ పరివర్తన అంతం కాదని గుర్తించాయి. బ్యాంకుల వద్ద ప్రపంచ నిర్ణయాధికారులలో 35 శాతం మంది తమ సంస్థ తమ డిజిటల్ పరివర్తనను విస్తరిస్తోందని మరియు 19 శాతం మంది ప్రస్తుతం రూపాంతరం చెందుతున్నారని చెప్పారు" అని నివేదిక పేర్కొంది. అయితే, డిజిట‌ల్ లావాదేవీల వైపు వినియోగ‌దారులు మొగ్గుచూపుతున్న క్ర‌మంలో భద్రత కూడా ఆందోళన కలిగిస్తున్న‌ది. బ్యాంకుల వద్ద నిర్ణయాధికారులలో 25 శాతం మంది తమ డిజిటల్ పరివర్తనను అమలు చేయడానికి భద్రత అతిపెద్ద అడ్డంకులుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. కోవిడ్-19 క్ర‌మంలో కస్టమర్ అంచనాలను పునర్నిర్మించడం, పోటీ పెర‌గ‌డం..డిజిట‌ల్ వినియోగం పెరుగుతున్న క్ర‌మంలో బ్యాంకులు ఎండ్-టు-ఎండ్ పరివర్తనను స్వీకరించాయి. ఈ క్ర‌మంలోనే మ‌రింత వేగంగా ప‌నిచేయ‌డం, సేవ‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తమ ఐటీ విభాగాల‌ను  మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి సారించాయని నివేదిక పేర్కొంది.