నలుగురి కోసం అమ్మాయిని పడేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం
ప్రేమించిన వ్యక్తే తనకు సర్వస్వమని నమ్మి వెళ్లిన యువతిపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రియుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది
ప్రేమించిన వ్యక్తే తనకు సర్వస్వమని నమ్మి వెళ్లిన యువతిపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రియుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది.
అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు, ఈ యువతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి లవర్తో ఏంజాయ్ చేయాలని భావించిన ప్రశాంత్ అందుకు ప్లాన్ గీశాడు. ఈ నెల 19న రాత్రి వాగు ఒడ్డుకు వెళ్లి మాట్లాడుకుందామని చెప్పడంతో.. ఆ యువతి నమ్మి అతనితో కలిసి వెళ్లింది.
అప్పటికే అక్కడ ప్రశాంత్ స్నేహితులు నలుగురు మాటు వేశారు. ఆమె వాగు సమీపంలోకి రాగానే.. వారంతా కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర ప్రతిఘటన తర్వాత వారి నుంచి తప్పించుకుని గాయాలతో ఆమె ఇంటికి చేరుకుంది.
భయంతో ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు గాని.. స్నేహితులకు గాని చెప్పలేదు.. అయితే ధైర్యం తెచ్చుకుని బుధవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ సహా అతని నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.
పని ఇప్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. వివాహితపై స్నేహితులతో కలిసి గ్యాంగ్రేప్
కన్న కూతురినే స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన తండ్రి
ఎనిమిది మంది బాలికలపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్
హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్
దొంగతనానికి వచ్చి... మహిళపై అత్యాచారం
లేడీ కానిస్టేబుల్పై ఎస్ఐ రేప్.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం
చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..
75 ఏళ్ల వృద్దురాలిపై 19ఏళ్ల యువకుడి అత్యాచారం, హత్య...
బాలికపై అత్యాచారం, హత్య... ఈ ముగ్గురు మైనర్లే నిందితులా?
విశాఖలో యువతిపై అత్యాచారం, హత్య...ప్రేమికుడిపైనే అనుమానం