సంగారెడ్డి జిల్లాలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్రేప్, ప్రాణాలు కాపాడిన డయల్ 100
సంగారెడ్డి జిల్లాలో గురువారం నాడు దారుణం చోటు చేసుకొంది. మైనర్ బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గల వాణీ నగర్లో మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. షాప్కు వచ్చిన బాలికపై ముగ్గురు దుండగులు కారులో కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. బాధితురాలి సెల్పోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు బాలిక ఆచూకీని కనుగొన్నారు.
Also read:గొంతులో బియ్యం పోసి, నోట్లో దుస్తులు కుక్కి రేప్: ఆస్పత్రిలో మహిళ మృతి
వాణీ నగర్లో బాధితురాలి కుటుంబం అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం బాధితురాలు దుకాణానికి వచ్చింది. అయితే బాలికను దుకాణం వద్దకు తీసుకెళ్తామని మాయామాటలు చెప్పిన ముగ్గురు నిందితులు కారులో ఆమెను కిడ్నాప్ చేశారు. అమీన్పూర్ కు రెండు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి బాలికపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. అయితే బాలిక దుకాణం వద్దకు వెళ్లి ఎంతకు రాకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫోన్ చేసింది. డయల్ 100 కు ఫోన్ చేసి తమ కూతురు కన్పించకుండాపోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే పోలీసులు స్పందించారు. బాలిక వద్ద ఉన్న సెల్పోన్ సిగ్నల్స్ ఆధారంగా బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుండి పారిపోయారు.
పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితులు తనను కారులో తీసుకొచ్చినట్టుగా బాధితురాలు చెప్పారు. నిందితులు ఎవరో తెలియదన్నారు.
గ్యాంగ్ రేప్ కు పాల్పడడంతో బాలిక కేకలు వేసింది.ఈ సమయంలో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. స్థానికులు వస్తున్న విషయాన్ని గుర్తించిన నిందితులు పారిపోయారు. ఘటన స్థలంలో మద్యం సీసాలతో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నిందితులను తాను గుర్తిస్తానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. బాధితురాలు పోలీసులకు కారుకు సంబంధించిన ఆనవాళ్లను చెప్పింది. అమీన్ పూర్ ప్రాంతంలో పోలీసులు సీసీటీవీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గుర్తించనున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
నిందితులు ఉపయోగించిన కారు నెంబర్ ను పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో బాధితురాలు సురక్షితంగా బయట పడినట్టు స్థానికులు చెప్పారు.
బాలిక ఆచూకీ కోసం స్థానికులు అమీనాపూర్ ప్రాంతంలో వెతికారు. స్థానికులు బాలికకు ఫోన్ చేస్తూ ఆమె ఆచూకీని కనిపెట్టారు. స్థానికులు పోలీసులకు ఘటన స్థలం చూపించారు. ఘటన స్థలంలో పోలీసులు క్లూస్ ను సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు చెబుతున్నారు.