Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరుతో వంచించి బాలికపై అత్యాచారం.. ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్.. ఎక్క‌డంటే ?

జనగామ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనను మరో యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

A girl was raped in the name of love.. The video of the incident was taken and posted on social media..
Author
First Published Oct 4, 2022, 9:13 AM IST

ప్రేమ పేరుతో ఓ బాలిక‌ను ఓ యువ‌కుడు మోసం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌ను వీడియో కూడా తీశాడు. అనంత‌రం దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైర‌ల్ అయ్యింది. ఈ ఘ‌ట‌న తెలుసుకున్న బాధితురాలి త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో ప్ర‌మేయం ఉన్న ఇద్ద‌రు యువ‌కులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జ‌న‌గామ జిల్లాలో జ‌రిగింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను స్టేష‌న్ ఘ‌న్ పూర్ పోలీస్ స్టేష‌న్ లో ఏసీపీ ర‌ఘుచంద‌ర్ మీడియాతో పంచుకున్నారు. చిల్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను గుర్రం శ్యాం అనే యువ‌కుడు ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు. ఆమెను న‌మ్మించాడు. దీంతో స‌మ‌యంలో చూసుకొని ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

జ‌మ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ హేమంత్ కే లోహియా దారుణ హ‌త్య‌..

ఈ దారుణాన్ని తుపాకుల సాంబ‌రాజు అనే యువ‌కుడు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అనంత‌రం దానిని కొంద‌రికి షేర్ చేశారు. దీంతో అది సోష‌ల్ మీడియాలోకి వెళ్లింది. ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో బాధితురాలి త‌ల్లికి ఈ దారుణం తెలిసింది. దీంతో ఆమె వెంట‌నే పోలీసులను ఆశ్ర‌యించారు. చిల్పూర్ పోలీసు స్టేష‌న్ కు వెళ్లి త‌న కూతురుపై జ‌రిగిన అఘాయిత్యాన్ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు. 

అనంత‌రం పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. బాధితురాలితో మాట్లాడారు. నిందితులైన ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో, రేప్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేశారు. త‌రువాత వారిని రిమాండ్ కు తీసుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగురు బాలుర ప్ర‌మేయం కూడా ఉంద‌ని పోలీసులు తెలిపారు. 

పిజ్జాలో పురుగులు.. మూడేండ్ల త‌రువాత‌ రూ. 7000 పరిహారం

ఇలాంటి ఘటనే గత నెల 14వ తేదీన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి హర్దుగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు తన పొరుగు మహిళ సహచరురాలు అని బాధితులు పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్‌మీడియాలో ప్రసారం చేస్తానని నిందితులు తన కూతురిని బెదిరించాడని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది. ముగ్గురు నిందితుల‌తో పాటు వారితో సంబంధం క‌లిగివున్న మ‌హిళ‌.. మొత్తం న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. 

బాధితురాలి కుటుంబం నుంచి అందిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పురుషులు, ఒక మహిళపై ఐపీసీ సెక్షన్లు 376డి (గ్యాంగ్రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 342 (తప్పుడు కాన్ఫిగ్మెంట్), 120-బి (నేరపూరిత కుట్ర), పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విశాల్ కుమార్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. 13 ఏళ్ల బాలికను ఆదివారం మధ్యాహ్నం నిందితురాలు తన ఇంటి వద్ద ఒక గదిలో బంధించింది. అక్కడ ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వారు వీడియో కూడా తీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios