హైద్రాబాద్లో ప్రహరీగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
ఇంటి ప్రహరీగోడ కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.
హైదరాబాద్: హైద్రాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ వీధిలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
మృతి చెందిన వారిని ఆరేళ్ల రోషిణి, నాలుగేళ్ల పావని, సారికలుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రహరీగోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.
విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గోడ కూలిపోవడానికి గల కారణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.