Ludhiana: స్కూల్ పైకప్పు కూలిపడటంతో ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన పంజాబ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోని స్టాఫ్ రూమ్ లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది.