Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరో 9 నగరాలకు జియో ట్రు 5జి సేవలు.. ఎటువంటి ఖర్చు లేకుండా ఆన్ లిమిటెడ్ డేటా..

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం అలాగే తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 
 

Jio Expands Its True5G Services To 9 More Cities In AP And Telangana
Author
First Published Jan 31, 2023, 5:26 PM IST

హైదరాబాద్:  దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో  ఇన్ఫో కామ్ 5G కవరేజీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరో 9 నగరాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్లు, నంద్యాల, తెనాలి అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంతో తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నగరాలు మంగళవారం నుండి Jio True 5Gని పొందబోతున్నాయి.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం అలాగే తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 

ఈ విస్తరణతో ఏపీలోని 22 నగరాలు, తెలంగాణలోని 9 నగరాలు ఇప్పుడు కస్టమర్లకు JioTrue5G సేవలను అందిస్తున్నాయి.
ఏ‌పి అండ్ తెలంగాణతో పాటు జియో దేశవ్యాప్తంగా 34 నగరాలతో Jio True 5G రోల్-అవుట్‌ను ప్రకటించింది. ఈ ప్రారంభంతో 225 నగరాల్లోని జియో కస్టమర్లు ఇప్పుడు ట్రూ 5G సేవలను ఆస్వాదించనున్నారు.

రిలయన్స్ జియో ఈ నగరాల్లో చాలా వరకు 5G సేవలను ప్రారంభించిన మొదటి ఇంకా ఏకైక ఆపరేటర్‌గా అవతరించింది. ఈ నగరాల్లోని జియో కస్టమర్లు ఈరోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వరకు  స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ డేటాను పొందేందుకు జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారు.

ఈ సందర్భంగా జియో ప్రతినిధి మాట్లాడుతూ, “మేము 34 అదనపు నగరాల్లో జియో ట్రూ 5G సేవలను ప్రారంభించడం పట్ల నిజంగా సంతోషిస్తున్నాము, ఇప్పుడు మొత్తం సంఖ్య 225 నగరాలకు చేరుకుంది. బీటా ట్రయల్ ప్రారంభించినప్పటి నుండి కేవలం 120 రోజులలోపు జియో ఈ మైలురాయిని సాధించింది ఇంకా డిసెంబర్ 2023 నాటికి ట్రాన్స్ఫార్మేషనల్ జియో ట్రూ 5G సేవలతో దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసే మార్గంలో ఉంది.

ఈ 5G నెట్‌వర్క్ రోల్‌అవుట్ స్కేల్ ప్రపంచంలో మొదటిసారి ఇంకా 2023 భారతదేశానికి ఒక మైలురాయి సంవత్సరం అవుతుంది, ఈ సమయంలో దేశం మొత్తం జియో  అత్యుత్తమ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందించబడిన విప్లవాత్మక ట్రూ 5G టెక్నాలజి ప్రయోజనాలను పొందుతుంది.

మన దేశాన్ని డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతరం సపోర్ట్ ఇస్తున్నందుకు కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 

Jio True 5G మూడు రెట్లు ప్రయోజనాన్ని ఉంది, ఇంకా భారతదేశంలోని ఏకైక ట్రు 5G నెట్‌వర్క్‌గా నిలిచింది:

1. 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో స్టాండ్-అలోన్ 5G ఆర్కిటెక్చర్ 
2. 700 MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లలో 5G స్పెక్ట్రమ్  అతిపెద్ద & బెస్ట్ మిక్స్ 
3. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఈ 5G హైఫ్రీక్వెన్సీలను సింగిల్ రోబస్ట్  డాటా హైవేలోకి సజావుగా మిళితం చేస్తుంది.  

Jio Expands Its True5G Services To 9 More Cities In AP And Telangana
 

Follow Us:
Download App:
  • android
  • ios