Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: హోరాహోరీ పోరులో ముంబైదే విజయం...పోరాడి ఓడిన యూపీ

ప్రో కబడ్డి లీగ్ లో యూ ముంబై మరో  విజయాన్ని అందుకుంది. యూసీ యోదాస్ తో  తలపడ్డ  ముంబై కేవలం 3 పాయింట్ల ఆదిక్యంతో విజయాన్న కైవసం చేసుకుంది. 

pro kabaddi 2019: u mumba super victory against up yoddha
Author
Pune, First Published Sep 18, 2019, 8:56 PM IST

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో యూ ముంబా మరో అద్భుత విజయాన్ని అందుకుంది.పూణేలోని  శ్రీ శివ్ చత్రపతి స్టేడియంలో యూ ముంబా- యూపీ యోదాస్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు చివరి వరకు గెలుపుకోసం హోరాహోరీగా పోరాడగా విజయం మాత్రం ముంబైని వరించింది. ఇలా కేవలం 3  పాయింట్ల తేడాతో యూపీ యోదాస్ పరాజయంపాలయ్యింది. 

ముంబై ఆటగాళ్లలో అభిషేస్ సింగ్ 11 పాయింట్లతో రాణించాడు. అలాగే అర్జున్ దేశాయ్ 7, సురేందర్ 6, ఫజల్ 3, అతుల్ 2 పాయింట్లతో  యూ ముంబా విజయంలో  తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడిగ్ లో 21, ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 4 మొత్తం ముంబై జట్టు 39 పాయింట్లు సాధించింది. 

 యూపీ యోదాస్ విషయానికి  వస్తే రిషాంక్ 9, శ్రీకాంత్ 8 పాయింట్లతో రాణించారు. సురేందర్ గిల్ 4, అషు 4, సుమిత్ 3, సచిన్ 2 పాయింట్లతో పరవాలేదనిపించినా  యూపీని మాత్రం గెలిపించలేకపోయారు. రైడింగ్  లో 23, ట్యాకిల్స్ లో 9, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 3 ఇలా 36 పాయింట్ల వద్దే ఆ జట్టు ఆట ముగిసింది. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం 3 పాయింట్ల ఆధిక్యంలో వున్న ముంబై విజేతగా నిలిచింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios