ప్రో కబడ్డి 2019: హోరాహోరీ పోరులో ముంబైదే విజయం...పోరాడి ఓడిన యూపీ
ప్రో కబడ్డి లీగ్ లో యూ ముంబై మరో విజయాన్ని అందుకుంది. యూసీ యోదాస్ తో తలపడ్డ ముంబై కేవలం 3 పాయింట్ల ఆదిక్యంతో విజయాన్న కైవసం చేసుకుంది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో యూ ముంబా మరో అద్భుత విజయాన్ని అందుకుంది.పూణేలోని శ్రీ శివ్ చత్రపతి స్టేడియంలో యూ ముంబా- యూపీ యోదాస్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు చివరి వరకు గెలుపుకోసం హోరాహోరీగా పోరాడగా విజయం మాత్రం ముంబైని వరించింది. ఇలా కేవలం 3 పాయింట్ల తేడాతో యూపీ యోదాస్ పరాజయంపాలయ్యింది.
ముంబై ఆటగాళ్లలో అభిషేస్ సింగ్ 11 పాయింట్లతో రాణించాడు. అలాగే అర్జున్ దేశాయ్ 7, సురేందర్ 6, ఫజల్ 3, అతుల్ 2 పాయింట్లతో యూ ముంబా విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడిగ్ లో 21, ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల రూపంలో 4 మొత్తం ముంబై జట్టు 39 పాయింట్లు సాధించింది.
యూపీ యోదాస్ విషయానికి వస్తే రిషాంక్ 9, శ్రీకాంత్ 8 పాయింట్లతో రాణించారు. సురేందర్ గిల్ 4, అషు 4, సుమిత్ 3, సచిన్ 2 పాయింట్లతో పరవాలేదనిపించినా యూపీని మాత్రం గెలిపించలేకపోయారు. రైడింగ్ లో 23, ట్యాకిల్స్ లో 9, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 3 ఇలా 36 పాయింట్ల వద్దే ఆ జట్టు ఆట ముగిసింది. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం 3 పాయింట్ల ఆధిక్యంలో వున్న ముంబై విజేతగా నిలిచింది.