Asianet News TeluguAsianet News Telugu

గ్రౌండ్ లో స్టెప్పులు వేసిన శిఖర్ దావన్

 గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తోన్న ‘భారత్‌ ఆర్మీ’ వారు డప్పులు మోగించారు. దీనికి అనుగుణంగా ధావన్‌ భాంగ్రా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. మైదానంలో ధావన్‌ స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

After Shikhar Dhawan, Harbhajan Singh and David Lloyd do bhangra in commentary box - watch video
Author
Hyderabad, First Published Sep 8, 2018, 3:09 PM IST

టీం ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఆనందంతో గ్రౌండ్ లో స్టెప్పులు వేశారు. ఆయన వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రస్తుతం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్టు లండన్‌లో జరుగుతోంది. శుక్రవారం టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌లో భారత్‌ ఆడే అన్ని మ్యాచ్‌లకు ‘భారత్‌ ఆర్మీ’ హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య ప్రారంభమైన చివరి టెస్టుకు భారత ఆర్మీ హాజరైంది. మొదటి రోజు మూడో సెషన్‌లో ధావన్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. 

ఆ సమయంలో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తోన్న ‘భారత్‌ ఆర్మీ’ వారు డప్పులు మోగించారు. దీనికి అనుగుణంగా ధావన్‌ భాంగ్రా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. మైదానంలో ధావన్‌ స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధావన్‌ స్టెప్పులను చూసి కామెంటేటర్స్‌ రూమ్‌లో నవ్వులు విరిశాయి. అంతేకాదు ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న భజ్జీ మరో కామెంటేటర్‌ డేవిడ్‌ లాయిడ్‌కి భాంగ్రా స్టెప్పులు ఎలా వేయాలో చూపించాడు కూడా.

 

ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌(11), రషీద్‌ (4) ఉన్నారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 1-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios