డిసెంబర్ రెండో వారంలో విశాఖపట్నంలో కరోనా కేసులు నమోదవడం మొదలయ్యింది. అప్పటినుంచి కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
Andhra Pradesh Jan 2, 2024, 10:30 AM IST
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30 మంది రిపోర్టులు రావాల్సి వుంది.
Telangana Dec 23, 2023, 8:53 PM IST
భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్. 1 వైరస్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదౌతున్నాయి.
NATIONAL Dec 21, 2023, 10:42 AM IST
తెలంగాణలో కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Telangana Dec 21, 2023, 4:46 AM IST
జేఎన్. 1 వేరియంట్ అనే కోవిడ్ రకం యూరప్, యూఎస్లో తీవ్రంగా వ్యాప్తి చెందుతూ వుండటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. లక్సెంబర్గ్లో వెలుగుచూసిన ఈ కోవిడ్ జేఎన్ .1 వేరియంట్ ప్రస్తుతం ఇంగ్లాండ్, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Health Nov 8, 2023, 6:57 PM IST
Covid-19: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన డేటా ప్రకారం.. భారత్ లో కోవిడ్-19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 70 కేసుల నమోదుతో క్రియాశీల కేసులు 466కు చేరుకున్నాయి. మొత్తంగా 5,32,031 మంది మరణించగా, ఇప్పటివరకు 4,49,98,463 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే, కోవిడ్-19 బారినపడి ఆస్పత్రిలో చేరి కోలుకున్న వారిలో మరణాలు, అనారోగ్య సమస్యలు పెరిగాయంటూ షాకింగ్ విషయాలను ఎన్సీఆర్సీ నివేదిక వెల్లడించింది.
NATIONAL Sep 24, 2023, 10:57 AM IST
యూకేలో వెలుగుచూసిన ఈజీ.5 వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్లోకి కూడా ఈ వేరియంట్ అడుగుపెట్టినట్లుగా నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం ఇప్పటికే ధ్రువీకరించింది.
NATIONAL Aug 10, 2023, 2:36 PM IST
ఇండోనేషియాకు చెందిన ఓ రోగిలో అత్యంత పరివర్తన చెందిన కోవిడ్ వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కౌంట్ను కూడా అధిగమించి 113 ఉత్పరివర్తనాలతో మనిషి శరీరంలో రూపాంతరం చెందింది.
Health Jul 28, 2023, 8:57 PM IST
New Delhi: కోవిడ్ వ్యాక్సిన్ త్వరగా తీసుకురావాలనే పరిస్థితుల మధ్య వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఉన్న రెడ్ అలర్ట్ లను కేంద్రం విస్మరించిందా? అనే సరికొత్త చర్చ వైద్య వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రారంభించిన టీకా కేంద్రాలకు కోట్లాది మంది ప్రజలు 'ప్రొటెక్టివ్ ప్రిక్' కోసం బారులు తీరారు, దాని సంభావ్య స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ ప్రస్తుతం అనారోగ్య సంబంధ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశం తెరమీదకు వస్తోంది.
NATIONAL Jun 18, 2023, 10:44 AM IST
Long Covid: నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ప్రతి 10 మందిలో ఒకరు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తర్వాత దీర్ఘకాలిక కోవిడ్ ప్రభావాలను పొందుతున్నారని కనుగొన్నారు. ఇది కోవిడ్ -19 మహమ్మారిలో మునుపటి కంటే తక్కువ అంచనాగా పలువురు పరిశోధకులు పేర్కొంటున్నారు.
INTERNATIONAL May 27, 2023, 12:18 PM IST
New Delhi: దేశంలో వరుసగా నాలుగో రోజు 10 వేలకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరగడం ఇది వరుసగా నాలుగో రో కావడం గమనార్హం. ఇదే క్రమంలో మణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి.
NATIONAL Apr 16, 2023, 11:14 AM IST
Coronavirus updates: చాలా నెలల తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రలో ఒకే రోజు కోవిడ్ కొత్త కేసులు 1,000 పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కొత్తగా 575 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఈ ఏడాది ఒకే రోజులో అత్యధికం అని అధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
NATIONAL Apr 14, 2023, 10:47 AM IST
New Delhi: కరోనా వైరస్ ప్రభుత్వ డేటా ప్రకారం.. ఎక్స్ బీబీ.1.16 వేరియంట్ ప్రస్తుతం కోవిడ్ ఉప్పెనకు కారణమవుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాలలో కనీసం 50 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో అయితే, ఈ వేరియంట్ కొత్త కేసులు దాదాపు 90 శాతం పైగా ఉన్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి.
NATIONAL Apr 13, 2023, 10:05 AM IST
New Delhi: దేశంలోని మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా, కేరళ, పుదుచ్చేరిలు ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలలంటూ హెచ్చరించింది.
NATIONAL Apr 10, 2023, 10:23 AM IST
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. సన్నద్ధతను అంచనా వేయడానికి ఏప్రిల్ 10 మరియు 11 తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే.. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలలో మాస్క్ తప్పనిసరి చేశారు.
NATIONAL Apr 9, 2023, 3:28 PM IST