ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు నిర్వహించాయి.ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు హాజరయ్యారు.
Telangana Oct 14, 2021, 10:31 AM IST
గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశంలో పెద్దవాగుపై ప్రయోగాత్మకంగా gazetteనోటిఫికేషన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సిబ్బంది మాత్రం ఎవరి రాష్ట్రాల పరిధిలోని వారే ఉంటారని సమావేశం స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకు రావాలని ఏపీ ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్ను telangana వ్యతిరేకించింది.
Telangana Oct 11, 2021, 3:26 PM IST
తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఇటీవల తుంగభద్ర నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు.
Telangana Oct 5, 2021, 4:39 PM IST
రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరేవరకు లేదా కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్లను ఆమోదించవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది.
Andhra Pradesh Sep 30, 2021, 9:26 AM IST
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Telangana Sep 21, 2021, 7:43 PM IST
తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీలోపుగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సహకరించాలని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను జీఆర్ఎంబీ కోరింది.
Telangana Sep 17, 2021, 5:02 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు.
Telangana Sep 3, 2021, 5:40 PM IST
ఏపీ ప్రభుత్వం అనవసరంగా తెలంగాణ ప్రాజెక్ట్లపై ఫిర్యాదు చేస్తోందని రాష్ట్ర నీటి పారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఆరోపించారు. రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమని కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ చైర్మన్లకు స్టేటస్ కో వుందని రజత్ కుమార్ వెల్లడించారు.
Telangana Sep 1, 2021, 10:14 PM IST
బుధవారం సాయంత్రం జలసౌధలో జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) భేటీకి హాజురుకావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు రేపటి సమావేశానికి హాజరవుతారు. అలాగే సాయంత్రం జరిగే కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ సంయుక్త భేటీకి కూడా తెలంగాణ అధికారులు హాజరవుతారు
Telangana Aug 31, 2021, 3:40 PM IST
ఇటీవల సంభవించిన వరదల వల్ల శ్రీశైలం జలాశయంలో ఎంత పూడిక చేరిందో గుర్తించేందుకు గాను అధికారులు హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలు ఉండగా 2009 వరదల వల్ల 215 టీఎంసీలకు నీటినిల్వ పడిపోయింది.
Andhra Pradesh Aug 22, 2021, 8:31 PM IST
మరో రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి అవసరమై కార్యాచరణ అమలు చేసేందుకు గాను టైం షెడ్యూల్ కోసం ఇరు రాష్ట్రాలతో రెండు బోర్డుల ఛైర్మెన్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Telangana Aug 9, 2021, 3:37 PM IST
ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలను వాయిదా వేయాలని ఏపీ ఈ రెండు బోర్డులకు తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖలు రాసింది.
Telangana Aug 8, 2021, 4:39 PM IST
ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ లోని అంశాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయాలని కేంద్రజల్ శక్తి కార్యదర్శి ఈ రెండు బోర్డులను ఆదేశించారు.
Telangana Aug 8, 2021, 2:21 PM IST
రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు
Telangana Aug 7, 2021, 9:11 PM IST
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని అందులో విజ్ఞప్తి చేసింది. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరింది.
Telangana Aug 7, 2021, 4:36 PM IST