పద్మశ్రీ అవార్డుకే వన్నె తెచ్చిన పెద్ద మనిషి
గుడ్ జాబ్
పద్మ శ్రీ అవార్డు అంటే భారతదేశంలో చాలా గొప్ప అవార్డుగా పేరుంది. అంతగొప్ప అవార్డు ఇప్పటి వరు అందరూ గొప్పవాళ్లకే వచ్చిందా? పనికిమాలిన వాళ్లకు రాలేదా? అంటే సమాధానం చెప్పలేం. కొందరు గొప్పవాళ్లకు పద్మశ్రీ వచ్చింది. మిగతా వారు కూడా కొందరు లేకపోలేదు.
అయితే వనజీవి రామయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ మనిషికి ఆ అవార్డు రావడం చూస్తే ఆయనకు అవార్డుతో గొప్పదనం రావడం కాదు. ఆయనతోనే పద్మశ్రీ అవార్డుకు గొప్పదనం వచ్చింది.
వనజీవి రామయ్య తాను నాటిన మొక్కలు భారీ వృక్షాలైనాయి. వాటి నుంచి నేల రాలిన నిద్రగన్నేరు, గానుగ విత్తనాలను మండుటెండలో ఏరుతున్నారు. ఇలా సేకరించిన విత్తనాలను వర్షా కాలం మొదలు కాగానే అడవుల్లోకి తీసుకెళ్లి చల్లుతారట. ఇప్పటికే 40కిలోల విత్తనాలను సేకరించారు రామయ్య.
హ్యాట్సాప్ వనజీవి రామయ్య గారూ...