Asianet News TeluguAsianet News Telugu

దారుణం: నవ వధువుపై భర్త, మరదులు గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆమె భర్తతో పాటు మరుదులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Woman molested by her husband and brothers in law in Uttar Pradesh
Author
Lucknow, First Published Jun 27, 2021, 7:14 AM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ పట్ల భర్తనే అత్యంత నీచానికి ఒడిగట్టాడు. కొత్తగా వివాహమై అత్తింట అడుగు పెట్టిన యువతికి అత్యంత దారుణమైన సంఘటన ఎదురైంది. ఆమెపై భర్తతో పాటు ఇద్దరు మరదులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుదాన్ లో ఆ సంఘటన జరిగింది. కొత్వాలి సహస్వన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి జరీఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ పూర్ కు చెందిన వ్యక్తితో ఈ నెల 22వ తేదీన పెళ్లయింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత యువతి అత్తింట అడుగు పెట్టింది. 

అయితే, అత్తింట ఆమెపై కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భర్త, ఇద్దరు మరదులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసారు. ఆమె చంపాలని కూడా ప్రయత్నించారు. 

తన కూతురు అత్తింటిలో ఎదుర్కుంటున్న వేధింపుల గురించి సమాచారం అందుకున్న ఆమె తండ్రి పోలీసులతో వెళ్లి ఆమెను రక్షించాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతో పాటు ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios